విశాఖపట్నం, మార్చి 23, నేటి తెలుగు పత్రిక: నారా లోకేష్ విశాఖపట్నంలో ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. తెలుగు దేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమం 83వ రోజుకు చేరింది.ఈ సందర్భంగా మంత్రి లోకేష్ ప్రజలు, పార్టీ కార్యకర్తల నుంచి వచ్చిన వినతులను స్వయంగా స్వీకరించారు. వివిధ సమస్యలను ఆయన శ్రద్ధగా విన్నారు.ప్రజల సమస్యల పరిష్కారంపై వెంటనే స్పందించిన లోకేష్, సంబంధిత అధికారులకు అప్పటికప్పుడే ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు తక్షణ న్యాయం అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నట్లు తెలిపారు.
