Breaking News

విజయవాడ లో సింహ గర్జన సెగ – కలెక్టరేట్‌కు కదిలిన బీసీవై పార్టీ శ్రేణులు

ఎన్టీఆర్ జిల్లా, మార్చి 23, నేటి తెలుగు పత్రిక: భారత చైతన్య యువజన పార్టీ (BCY) వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారి పిలుపు మేరకు, పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కలెక్టర్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. సింహ గర్జన వేదికగా పార్టీ ప్రతిపాదించిన 5 కీలక డిమాండ్లను వెంటనే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు.అనంతరం ప్రెస్ మీట్ కార్యక్రమంలో పాల్గొని

  1. బీసీ రక్షణ చట్టం
  2. అమరావతి రాజధాని లో బీసీలకు 1000ఎకరాలు కేటాయించాలి.
  3. సమగ్ర కులగణన
  4. విద్య,ఉపాధి అవకాశాలు లో 44%రిజర్వేషన్లు కల్పించాలి.
  5. బీసీ కార్పొరేట్ నిధులు అమలు చేయాలి.

ఈ 5 డిమాండ్ లు వెంటనే అమలు చేయాలి అని డిమాండ్ చేశారు.కానీ పక్షం లో అధ్యక్షులు రామచంద్ర యాదవ్ గారితో కలిసి ఏప్రిల్ 11వ తేదీన విజయవాడ కేంద్రంగా ఆమరణ నిరాహార దీక్ష కు సిద్ధం అని పేర్కొన్నారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

ఈ కార్యక్రమంలో బిసివై పార్టీ రాష్ట్ర నాయకులు పచ్చిపాల నాగేశ్వరావు గారు మరియు కందికట్టు నరసింహారావు గారు, ఎన్టీఆర్ జిల్లా యూత్ కన్వీనర్ గుడారు శంకర్ శ్రీనివాసరావు యాదవ్ గారు, మైలవరం కన్వీనర్ ముప్పసాని భూలక్ష్మీ గారు , జగ్గయ్యపేట యూత్ కన్వీనర్ సత్యశేఖర్,తోకల రామకృష్ణ గారు, గుమ్మ చంద్రశేఖర్, కూకట్లపల్లి శ్రీనివాసరావు, దుళ్ళ వెంకట్రావు,నన్నెబోయిన రాకేశ్, అరిగెల గొప్పయ్యస్వామి,పార్టీ నాయకులు, కార్యకర్తలుతదితరులు పాల్గొన్నారు

సీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనిత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *