ఎన్టీఆర్ జిల్లా, మార్చి 23, నేటి తెలుగు పత్రిక: భారత చైతన్య యువజన పార్టీ (BCY) వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారి పిలుపు మేరకు, పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కలెక్టర్ను కలిసి వినతి పత్రం అందజేశారు. సింహ గర్జన వేదికగా పార్టీ ప్రతిపాదించిన 5 కీలక డిమాండ్లను వెంటనే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు.అనంతరం ప్రెస్ మీట్ కార్యక్రమంలో పాల్గొని
- బీసీ రక్షణ చట్టం
- అమరావతి రాజధాని లో బీసీలకు 1000ఎకరాలు కేటాయించాలి.
- సమగ్ర కులగణన
- విద్య,ఉపాధి అవకాశాలు లో 44%రిజర్వేషన్లు కల్పించాలి.
- బీసీ కార్పొరేట్ నిధులు అమలు చేయాలి.
ఈ 5 డిమాండ్ లు వెంటనే అమలు చేయాలి అని డిమాండ్ చేశారు.కానీ పక్షం లో అధ్యక్షులు రామచంద్ర యాదవ్ గారితో కలిసి ఏప్రిల్ 11వ తేదీన విజయవాడ కేంద్రంగా ఆమరణ నిరాహార దీక్ష కు సిద్ధం అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బిసివై పార్టీ రాష్ట్ర నాయకులు పచ్చిపాల నాగేశ్వరావు గారు మరియు కందికట్టు నరసింహారావు గారు, ఎన్టీఆర్ జిల్లా యూత్ కన్వీనర్ గుడారు శంకర్ శ్రీనివాసరావు యాదవ్ గారు, మైలవరం కన్వీనర్ ముప్పసాని భూలక్ష్మీ గారు , జగ్గయ్యపేట యూత్ కన్వీనర్ సత్యశేఖర్,తోకల రామకృష్ణ గారు, గుమ్మ చంద్రశేఖర్, కూకట్లపల్లి శ్రీనివాసరావు, దుళ్ళ వెంకట్రావు,నన్నెబోయిన రాకేశ్, అరిగెల గొప్పయ్యస్వామి,పార్టీ నాయకులు, కార్యకర్తలుతదితరులు పాల్గొన్నారు
