Breaking News

కాంగ్రెస్ పాలన ప్రజా వ్యతిరేక పాలన : రచ్చ శ్రీనివాస్ బిజెపి స్టేట్ కౌన్సిల్ సభ్యులు

యాదగిరిగుట్ట : మార్చి 23 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): రాష్ట్రంలో ప్రభుత్వంఅవినీతి అరాచక కమీషన్ల పాలనతో తెలంగాణ ను భ్రష్టు పట్టిస్తూ ప్రజల బతుకులను ఆగం చేస్తూ భావితరాలకు భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ నిలదీస్తూ బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఎన్ రామచంద్ర రావు గారి నేతృత్వంలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం తలపెట్టిన సందర్భంగా ఈరోజు పోలీసులు నన్ను మరియు ఇతర నాయకులను అక్రమంగా ఇంటిదగ్గర అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కి తరలించడం జరిగింది ఇలాంటి అక్రమ అరెస్టులకి భయపడేది లేదని ప్రజలలో బిజెపికి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక ఇలాంటి అరెస్టులు కాంగ్రెస్ ప్రభుత్వం చేయించడం కాంగ్రెస్ దుర్మార్గ పాలన. రాబోయే ఎలక్షన్ లో ప్రజలు కాంగ్రెస్ పాలనఅంతం చేయడం తద్యం అని రచ్చ శ్రీనివాస్ అన్నారు.ఇలాంటి అక్రమ అరెస్టులతో ప్రజా ఉద్యమాలని ఆపలేరని ప్రజల కోసం పనిచేయడంలో బిజెపి ఎప్పుడు ముందుంటది. మోసపూరిత వాగ్దానాలతో ప్రజలను వంచించిన కాంగ్రెస్ ను మెడలు వంచుడామ్ సోయి తప్పి పేదల ఉసురు పోసుకుంటున్న రేవంత్ సర్కారుకు సురుకులు పెడదాం అని రచ్చ శ్రీనివాస్ అన్నారు. అరెస్టయిన వారిలో పట్టణ అధ్యక్షుడు కర్ర ప్రవీణ్ రాష్ట్ర కిసాన్ మోర్చా సభ్యుడు గుంటుపల్లి సత్యనారాయన తదితరులు ఉన్నారు.

మహిళా సాధికారతకు కొత్త దిశ.. తెలంగాణలో జిల్లా మహిళా సమాఖ్య భవనాలు సిద్ధం

కరీంనగర్ ఘటనపై డీజీపీకి బీఆర్‌ఎస్ ఫిర్యాదు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *