మార్చి 23, నేటి తెలుగు పత్రిక: డిజిటల్ యుగంలో భద్రత, గోప్యతపై పెరుగుతున్న ఆందోళనల మధ్య స్వదేశీ టెక్నాలజీతో కొత్త కమ్యూనికేషన్ ప్లాట్ఫామ్ అందుబాటులోకి వచ్చింది. అనువాదిని AI అభివృద్ధి చేసిన హైప్డ్ సంవాదిని మరియు దేశీ AI GenZ కీబోర్డ్ యాప్లు వినియోగదారులకు సురక్షితమైన డిజిటల్ అనుభవాన్ని అందించనున్నాయి.ఈ ప్లాట్ఫామ్లో మొబైల్ నంబర్ షేర్ చేయాల్సిన అవసరం లేకుండా డైనమిక్ చాట్ ఐడీల ద్వారా చాట్లు, గ్రూప్ చాట్లు, ఆడియో, వీడియో కాల్స్ చేయవచ్చు. ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్, యాంటీ-స్పామ్ టెక్నాలజీతో సైబర్ మోసాల నుంచి రక్షణ కల్పిస్తామని సంస్థ తెలిపింది.
బుద్ధ చంద్రశేఖర్ మాట్లాడుతూ, ఈ ప్లాట్ఫామ్ 22 భారతీయ భాషలు, 37 విదేశీ భాషల్లో రియల్-టైమ్ టెక్స్ట్, వాయిస్ అనువాదాన్ని అందిస్తుందని చెప్పారు. భాషా వైవిధ్యాన్ని ఒకే వేదికపై కలపడం ఈ యాప్ లక్ష్యమని తెలిపారు.ఇందులో SOS ఫీచర్ కూడా ఉండటం ప్రత్యేకత. అత్యవసర పరిస్థితుల్లో లైవ్ లొకేషన్తో సహాయం పొందేలా రూపొందించారు. ముఖ్యంగా మహిళలు, విద్యార్థులు, వృద్ధులకు ఇది ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు.ఇక దేశీ AI GenZ కీబోర్డ్ ద్వారా 90కి పైగా భాషల్లో టైపింగ్, వాయిస్-టు-టెక్స్ట్, ఇన్స్టంట్ ట్రాన్స్లేషన్ సదుపాయం లభిస్తుంది. GIFలు, స్టిక్కర్లు, AI స్టిక్కర్లు, కస్టమైజేషన్ ఫీచర్లతో యువతకు ఆకర్షణీయంగా రూపొందించారు.
