Breaking News

బెల్లంపల్లి సిపిఐ కార్యాలయంలో ఘనంగా భగత్ సింగ్ 95వ వర్ధంతి

బెల్లంపల్లి, మార్చి 23 (నేటి తెలుగు పత్రిక): బెల్లంపల్లి పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో సోమవారం షాహిద్ భగత్ సింగ్, రాజ్ గురు సుకుదేవ్ ల 95వ వర్ధంతి కార్యక్రమాన్ని సిపిఐ పట్టణ కార్యదర్శి ఆడిపు రాజమౌళి ఆధ్వర్యంలో నాయకులు ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆ మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. వారి త్యాగాలను స్ఫూర్తిగా చేసుకుని పోరాటాలు సాగించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ బెల్లంపల్లి నియోజకవర్గ కార్యదర్శి దాగం మల్లేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు చిప్ప నరసయ్య, సహాయ కార్యదర్శి బొల్లం తిలక్ అంబేద్కర్, బెల్లంపల్లి మండల కార్యదర్శి బొంతల లక్ష్మీనారాయణ, బండారి శంకర్, ఊర్ల సమ్మయ్య, స్వర్ణలత, ఇనుముల రాయమల్లు తదితరులు పాల్గొన్నారు.

మహిళా సాధికారతకు కొత్త దిశ.. తెలంగాణలో జిల్లా మహిళా సమాఖ్య భవనాలు సిద్ధం

కరీంనగర్ ఘటనపై డీజీపీకి బీఆర్‌ఎస్ ఫిర్యాదు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *