యాదగిరిగుట్ట : మార్చి 23 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): భువనగిరి జిల్లాకు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ గౌడ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రత్యేకంగా రావడం ఆయనకి ప్రత్యేక కృతజ్ఞతలు.పదవి తీసుకోవడం గొప్ప కాదు… దాని నిలబెట్టుకోవడం గొప్ప …మనకి నచ్చిన వాళ్లకు పదవులు ఇవ్వడం కాదు, ప్రజల మధ్యలో ఉండే వారికి ఇస్తే పార్టీ బాగుంటుంది .ఎన్నికల ముందు పాత కక్షలతో నాయకుల మధ్యల సమన్వయం లేదు ఇప్పుడు ఎన్నికలు లేవు పార్టీని పటిష్టం చేయాలి.ఇచ్చిన పథకాల గురించి కూడా చెప్పుకునే పరిస్థితి నాయకులకు లేకుండా పొయింది.90 మందికి పథకాలు వచ్చిన రాని పది మందితో సోషల్ మీడియాలో వ్యతిరేకత చూపెడుతున్నారు.కొన్ని శక్తులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి మూసి ప్రక్షాళన చేస్తే మంచి పేరు వస్తుందని అసత్య ప్రచారాలు చేస్తూ వారి అక్కసు వెళ్లగకూతునారు.పని చేస్తేనే గుర్తింపు నేను పని చేయకపోయినా ఎంపీ ఎవరో అనే పరిస్థితి వస్తుంది.నేను మొదటి సారి గెలవడం నా ప్రోగ్రెస్ రిపోర్ట్ లేకపోవడం తో పార్టీ గుర్తు తో గెలిచా.మరల గెలవడం నా వర్క్ ప్రోగ్రెస్ తోనే నేను మంచి చేయకపోతే విపు పై గుద్దుతరు.నేను వంద ఓట్ల ఓనర్ ను చూసి మాత్రమే భయపడుతా… ఎవరో వచ్చి ఏదో చెప్తే వినను.
