నడిగూడెం ,మార్చ్ 23(నేటి తెలుగు పత్రిక): సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం బీజేపీ నాయకుల అక్రమ అరెస్టులు కేసులు బనాయస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం నేడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు గౌ.శ్రీ.N రామచందర్ రావు అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చారు.అందులో భాగంగా ఈరోజు ఉదయం 3-30 నిమిషాలకు మమ్మల్ని నడిగూడెం పోలీసులు అరెస్టు చేశారు. ఈ అక్రమ అరెస్టులు, ఎన్ని చేసినా ప్రజల తరఫున ఉద్యమాలు ప్రజా పోరాటాలు చేపడుతామని బిజెపి నడిగూడెం మండల అధ్యక్షులు బండారు వీరబాబు యాదవ్ అన్నారు. అరెస్ట్ అయిన వారిలో బిజెపి మండల ఉపాధ్యక్షులు, నడిగూడెం గ్రామ ఐదో వార్డు సభ్యులు మామిడి రామకృష్ణ , బిజెపి నడిగూడెం మండల కార్యదర్శి మొగలగాని వీరన్న గౌడ్, నడిగూడెం మండలం యూత్ అధ్యక్షులు చినికేసి గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
