Breaking News

రైతు భరోసా నిధుల జమ ప్రారంభం.. కొత్త గైడ్‌లైన్స్ అమలు

మార్చి 23, నేటి తెలుగు పత్రిక: తెలంగాణ ప్రభుత్వం రైతులకు అందించే రైతు భరోసా పథకంపై కీలక అప్డేట్ ఇచ్చింది. సోమవారం నుంచి తొలి విడత నిధుల విడుదల ప్రారంభమై, రైతుల బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమ అవుతున్నాయి.సిద్దిపేట జిల్లా నర్మెట్టలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నిధులను విడుదల చేశారు. బ్యాంక్ సెలవు కారణంగా ఆలస్యమైన జమ ప్రక్రియ ఇప్పుడు ప్రారంభమైంది.ఈ విడతలో 68.90 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుండగా, 57.45 లక్షల ఎకరాలకు సాయం అందనుంది. మొత్తం రూ.3,446.94 కోట్ల నిధులు విడుదల కానున్నాయి. తొలి విడతలో ఎకరానికి రూ.6 వేలు చొప్పున రైతుల ఖాతాల్లో జమ అవుతోంది.


మారిన గైడ్‌లైన్స్ (New Guidelines):

ఈసారి ప్రభుత్వం ముఖ్యమైన మార్పులు చేసింది:

సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా చెక్కుల పంపిణీ
  • గతంలో లాగా విడతల వారీగా కాకుండా,
    ఎంత భూమి ఉన్నా మొదటి విడతలో ఎకరానికి రూ.6 వేలు అందరికీ జమ
  • రెండో విడతలో 3 ఎకరాల వరకు,
  • మూడో విడతలో మిగిలిన భూమికి సాయం అందించనున్నారు

దీంతో రైతులు నెలల తరబడి వేచి ఉండాల్సిన అవసరం లేకుండా తొలి విడతలోనే డబ్బులు పొందగలుగుతున్నారు.


ఇంకా ముఖ్య విషయాలు:

  • కొత్తగా పట్టాదారు పాసు పుస్తకాలు పొందిన సుమారు 6 వేల మంది రైతులకు కూడా సాయం అందుతుంది
  • ధరణి పోర్టల్‌లో వివరాలు సరిగా నమోదు చేయాలి
  • ఆధార్, బ్యాంక్ పాస్‌బుక్ వివరాలు అధికారులకు సమర్పించాలి
  • బ్యాంక్ ఖాతా వివరాల్లో మార్పులు ఉంటే వెంటనే అప్డేట్ చేయాలి

భగత్ సింగ్ స్ఫూర్తితో అమెరికా యుధోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడుదాం: పి.వై.ఎల్.-పి.డి.ఎస్.యూ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *