Breaking News

విద్యుత్ ఘతానికి గురైన చిన్నారులను పరామర్శించి ఆర్ధిక సహాయం అందజేసిన మంగళగిరి నియోజకవర్గ టీడీపీ నేత కొమ్మా రెడ్డి కిరణ్.

మంగళగిరి మార్చి 23 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): నారా లోకేష్ స్ఫూర్తితో చిన్నారులను పరామర్శించి 25000 వేల రూపాయలు ఆర్ధిక సహాయం కుటుంబ సభ్యులకు అందజేసిన కొమ్మా రెడ్డి కిరణ్.ఉండవల్లిలో నిన్న విద్యుత్ ఘాతానికి గురైన చిన్నారులు కుప్పాల విష్ణుప్రియ, త్రివిక్రమ్ లను మణిపాల్ ఆసుపత్రిలో పరామర్శించి విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు 25000 వేల రూపాయలు ఆర్ధిక సహాయం అందజేశారు. అనంతరం కుటుంబ సభ్యులను అడిగి చిన్నారుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.. అన్ని విధాల అండగా ఉంటామని కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు.. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు దాసరి కృష్ణ, బసివిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

సీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనిత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *