Breaking News

రైతు భరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు

మార్చి 24, నేటి తెలుగు పత్రిక: రైతు సంక్షేమానికి కీలకంగా భావిస్తున్నరైతు భరోసా పథకం కింద తొలి విడత నిధులను విడుదల చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ను పలువురు ప్రజాప్రతినిధులు కలిసి కృతజ్ఞతలు తెలిపారు.శాసనమండలి, శాసనసభ ప్రభుత్వ విప్‌లు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు కలిసి సీఎంను అభినందించారు. రైతుల పట్ల ప్రభుత్వం చూపుతున్న చిత్తశుద్ధిని వారు ప్రశంసించారు.సిద్ధిపేట జిల్లా నర్మెట్టలో నిర్వహించిన రైతు ఉత్సవాల్లో సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా తొలి విడత నిధులను విడుదల చేశారు. ఈ నిధులు ఇప్పటికే రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమయ్యాయి.రైతులకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోందని, భవిష్యత్తులో మరింత సహాయం అందించేందుకు కట్టుబడి ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది.

ప్రాథమిక పాఠశాలకు ఫ్యాన్ల బహుకరణ

మళ్లీ మోసాలకు పాల్పడుతున్న క్యూనెట్.. పోలీసుల భారీ దాడులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *