Breaking News

“యుద్ధానికి మొదటగా మద్దతిచ్చింది అతడే” – ట్రంప్

మార్చి 24, నేటి తెలుగు పత్రిక: ఇరాన్‌తో కొనసాగుతున్న యుద్ధం నాలుగో వారంలోకి చేరిన నేపథ్యంలో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ యుద్ధం ప్రారంభంపై మాట్లాడుతూ, సైనిక చర్యకు మొదట మద్దతు తెలిపింది తన రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ అని వెల్లడించారు.టెన్నెస్సీలో జరిగిన మీడియా సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ, ఇరాన్ అణ్వాయుధ అభివృద్ధిని అడ్డుకోవాల్సిన అవసరాన్ని హెగ్‌సెత్ ముందుగా ప్రస్తావించారని తెలిపారు. అదే ఈ యుద్ధానికి దారితీసిన ముఖ్య కారణమని ఆయన పేర్కొన్నారు.ఈ యుద్ధంపై అమెరికా ప్రభుత్వంలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు అధికారులు ఇజ్రాయెల్ ఇప్పటికే దాడికి సిద్ధమవుతోందని భావించి అమెరికా జోక్యం అవసరమని అంటుండగా, మరికొందరు ఇరాన్ అణ్వాయుధాల ప్రమాదాన్ని ప్రధాన కారణంగా చెబుతున్నారు.

తెలంగాణ అభివృద్ధికి సంపూర్ణ సహకారం: ప్రధాని మోదీ

ఈ సందర్భంగా JD వాన్స్ యుద్ధంపై పెద్దగా ఆసక్తి చూపలేదని ట్రంప్ తెలిపారు. మరోవైపు, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సహా పలువురు సైనిక చర్యకు మద్దతుగా ఉన్నట్లు సమాచారం.అమెరికా లక్ష్యం ఇరాన్ క్షిపణి, డ్రోన్, నౌకాదళ సామర్థ్యాలను బలహీనపరచడమేనని రక్షణ శాఖ స్పష్టం చేసింది. అయితే ఈ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో స్పష్టత లేదని అధికారులు తెలిపారు.ఇదిలా ఉండగా, ట్రంప్ ఇరాన్‌తో చర్చలకు కూడా సిద్ధమని సంకేతాలు ఇచ్చారు. తన ప్రతినిధులు ఇరాన్ నాయకులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు పేర్కొన్నారు. అయితే ఇరాన్ ఈ చర్చలను ఖండించింది.

ఒమన్ ఒప్పందంతో ఇంధన సరఫరాకు భరోసా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *