Breaking News

ఆర్డీటీ సేవలు కొనసాగింపు నారా లోకేష్

మార్చి 24, నేటి తెలుగు పత్రిక: తెలుగు రాష్ట్రాల ప్రజలకు శుభవార్త. దశాబ్దాలుగా పేదల సంక్షేమానికి సేవలు అందిస్తున్న రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్కార్యకలాపాలు ఇకపై యథావిధిగా కొనసాగనున్నాయి.ఆర్డీటీకి సంబంధించిన ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ (FCRA) లైసెన్స్ రీన్యువల్ కావడంతో సంస్థకు ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి. దీంతో పేదల ఇళ్లలో వెలుగు నింపే కార్యక్రమాలు, నిరుపేద పిల్లల విద్య, ఉపాధి, వైద్య సేవలు ఇక నిరంతరాయంగా కొనసాగనున్నాయి.ఈ విషయమై కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి, ఆర్డీటీ చేస్తున్న సేవలను వివరించినట్లు తెలిపారు. ఈ సమస్య పరిష్కారానికి సహకరించిన నరేంద్ర మోదీ, అమిత్ షా మరియు కేంద్ర అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.దశాబ్దాలుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఆర్డీటీ నిర్వాహకులు మాంచో ఫెర్రర్ ను కూడా అభినందించారు. మొత్తం మీద, ఆర్డీటీ సేవలు కొనసాగడం వల్ల లక్షలాది పేద కుటుంబాలకు మరింత మద్దతు లభించనుంది.

లక్ష జనాభా దాటిన మండలాలకు అదనపు తహసీల్దార్‌: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

బీజేపీ దాడులతో ప్రశ్నలను తప్పించుకోలేరు: కేటీఆర్ మండిపాటు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *