Breaking News

ప్రాథమిక పాఠశాలకు ఫ్యాన్ల బహుకరణ

కోదాడ, మార్చి24 (నేటి తెలుగు పత్రిక): సూర్యాపేట జిల్లా ,నడిగూడెం మండలం రత్నవరం గ్రామంలోని ప్రాథమిక పాఠశాల లో మండవ వెంకయ్య రిటైర్డ్ ఎల్ డి సి జ్ఞాపకార్థం వారి కోడలు మనుమలు మండవ నాగమణి, గోపి, వెంకటేష్ లు పాఠశాలకు దాతృత్వం తో రెండు సీలింగ్ ఫ్యాన్ లను (5000 రూపాయలు విలువచేసే) బహుకరించారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ దాట్ల నాగేశ్వరరావు చేతుల మీదుగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మంద పుల్లయ్య, ఉపాధ్యాయులు మొలుగూరి కరుణ కు అందజేశారు. సి ఆర్ పి నందిగామ రామారావు, గ్రామ పెద్దలు పోలంపల్లి వెంకటేశ్వర్లు, కాసాని శ్రీనివాస్ రావు, పోలంపల్లి నాగేశ్వరరావు ప్రీ ప్రైమరీ ఉపాధ్యాయురాలు అనంతు.త్రివేణి, ఆయా కనకం స్వాతి, అంగన్వాడీ టీచర్ కమలమ్మ, ఆయాలు గురవమ్మ సాయమ్మ, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణలో ఎలక్ట్రిక్ వాహనాలపై భారీ రాయితీలు.. ప్రభుత్వ నిర్ణయం

సూర్యాపేట జిల్లాలో చిత్ర షూటింగ్స్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *