మార్చి 24, నేటి తెలుగు పత్రిక: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన ఓవర్సీస్ విద్యా నిధి పథకంపై మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.తమ ప్రభుత్వం కాలంలో దళిత, గిరిజన, వెనుకబడిన తరగతులకు చెందిన సుమారు 7,000 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.20 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించినట్లు ఆయన గుర్తుచేశారు.అయితే, 2025 అక్టోబర్లో విదేశీ విద్య కోసం రూ.303 కోట్లు విడుదల చేస్తామని ప్రకటించిన భారత జాతీయ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు ఆ నిధులను విడుదల చేయలేదని విమర్శించారు. ప్రస్తుతం దాదాపు 2,500 మంది విద్యార్థులు ఆర్థిక సహాయం కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు. విదేశాల్లో చదువుతున్న విద్యార్థులు మొదటి సెమిస్టర్ ఫీజులు చెల్లించినప్పటికీ, రెండో సెమిస్టర్ ఫీజులు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.ఈ నేపథ్యంలో, విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా వెంటనే నిధులు విడుదల చేసి, గ్రీన్ ఛానల్ ద్వారా ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రభుత్వాన్ని కేటీఆర్ కోరారు.విద్య మధ్యలో ఆగకుండా చూడటం ప్రభుత్వ బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు.
