సూర్యాపేట, మార్చి 24, (నేటి తెలుగు పత్రిక): గుడుగుంట్ల మహేష్ హీరోగా సార్ జాంబి సినిమా, N.N.రాజు దర్శకత్వంలో నిర్మాతగా MNR ,NNR నిర్మించిన ఈ సినిమా మన మునగాల దగ్గర్లో ఉన్న , పెన్ పహాడ్ మండలం,చీదెళ్ల గ్రామంలోని సుందరమైన పచ్చటి ప్రకృతిలో ఈ షూటింగ్ క్లైమాక్స్ జరిగినది. ఈ చిత్రంలో కోదాడ కళాకారులు శ్రీ జి శ్యాంసుందర్, మహమ్మద్ రఫీక్, డి వి, ఉపేందర్, శరత్ బాబు , సైదులు నటించారు. ఈ చిత్రము మే నెలలో విడుదల అని దర్శకుడు వివరించినాడు.
