మార్చి 24, నేటి తెలుగు పత్రిక: రైలు ప్రయాణికులకు ముఖ్య సమాచారం. భారతీయ రైల్వేలు టికెట్ రద్దు నిబంధనలను సవరించింది. రైలు బయలుదేరే సమయానికి ముందు ఎంత సమయంలో టికెట్ రద్దు చేస్తారనే దాని ఆధారంగా రీఫండ్ మారనుంది.ఈ కొత్త నిబంధనలు 2026 ఏప్రిల్ 1 నుంచి దశలవారీగా అమల్లోకి రానున్నాయి.కొత్త విధానం ప్రకారం, రైలు బయలుదేరే సమయానికి 72 గంటల ముందు టికెట్ రద్దు చేస్తే గరిష్ట రీఫండ్ లభిస్తుంది. 72 నుంచి 24 గంటల మధ్య రద్దు చేస్తే టికెట్ ధరలో 25 శాతం కోత విధిస్తారు.
అలాగే, 24 నుంచి 8 గంటల మధ్య రద్దు చేస్తే 50 శాతం వరకు కోత ఉంటుంది. రైలు బయలుదేరే సమయానికి 8 గంటల లోపు టికెట్ రద్దు చేస్తే ఎలాంటి రీఫండ్ ఇవ్వబడదు.ఇక మరో మార్పుగా, ప్రయాణికులు రైలు బయలుదేరే సమయానికి 30 నిమిషాల ముందు వరకు తమ బోర్డింగ్ స్టేషన్ను మార్చుకునే సౌకర్యం కల్పించారు.ఈ నిర్ణయం టికెట్ దళారుల అక్రమాలను అరికట్టడం కోసం తీసుకున్నట్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.కొత్త నిబంధనలతో ప్రయాణికులు ముందుగానే ప్లాన్ చేసుకోవడం అవసరం.
