విజయవాడ, మార్చి 24, నేటి తెలుగు పత్రిక: విజయవాడలో పట్టుబడిన ముగ్గురు యువకుల కేసు కొత్త మలుపు తిరిగింది. విచారణలో వీరికి ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం.ఈ ముగ్గురు యువకులు ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఉగ్రవాద సానుభూతిపరులతో కూడా సంబంధాలు కొనసాగించినట్లు వెల్లడైంది. ఈ కేసు నేపథ్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందాలు ఢిల్లీ, రాజస్థాన్, బీహార్, తెలంగాణ రాష్ట్రాలకు వెళ్లి దర్యాప్తు చేపట్టాయి.పోలీసుల ప్రాథమిక విచారణలో, మొత్తం ఏడు రాష్ట్రాల్లో విస్తరించిన నెట్వర్క్ ఉన్నట్లు తేలింది. ఈ నెట్వర్క్లో భాగంగా సుమారు 42 మంది సభ్యులతో ఒక గ్రూప్ ఏర్పాటైనట్లు అధికారులు అనుమానిస్తున్నారు.ఈ కేసును అత్యంత సీరియస్గా తీసుకున్న దర్యాప్తు సంస్థలు, దేశవ్యాప్తంగా ఉన్న అనుమానితులపై నిఘా పెంచాయి. త్వరలో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశాలు ఉన్నాయని సమాచారం. మొత్తంగా, ఈ ఘటన దేశ భద్రతాపరంగా కీలకంగా మారగా, పలు రాష్ట్రాల్లో దర్యాప్తు వేగవంతమైంది.
