Breaking News

కొత్త హామీలతో ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

  • సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దాసరి పాండు.

యాదగిరిగుట్ట : మార్చి 24 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయక కొత్త హామీల పేరుతో ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దాసరి పాండు అన్నారు.ఈ మంగళవారం రోజున ఇంటింటి సిపిఎం పార్టీలో కార్యక్రమంలో భాగంగా ఆత్మకూరు మండల కేంద్రంలో ఇంటింటి సిపిఎం కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు రేషన్ కార్డులో అన్ని రకాల పెన్షన్లు పెంచుతామని రైతు రుణమాఫీ , రైతు బంధు , మహిళలకు డబ్బులు , ఇస్తామని చెప్పిన హామీలు అమలు చేయకపోగా బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఇచ్చిన హామీలు అమలు చేయడానికి బడ్జెట్ కేటాయించకుండా కొత్త పథకాలు అమలు చేస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు హామీలు చేయకుండా మూసి సుందరీ కరణ పేరుతో నూతన విద్యా విధానం ప్రైమరీ స్కూల్ పేరుతో విద్యను నాణ్యమైన విద్యను అందిస్తూ మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేస్తామని , రైతులకు రుణమాఫీ చేస్తామని , హైదరాబాదు చుట్టూ రోడ్లు ఏర్పాటు చేసి హైదరాబాదు నగరాన్ని అభివృద్ధి చేస్తామని అనేక పథకాలు అమలు చేస్తామని చెప్పడం తప్పుతుంది కానీ గ్రామాల్లో ఉన్న రైతులకు ఉపయోగపడే భూ నాది గాని కాలువ పూర్తి చేయడం కోసం కాలువలో భూములు కోల్పోతున్న నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించడంలో కాలువలు పూర్తి చేసి రైతులకు నీళ్లు అందించడంలో ఈ ప్రభుత్వానికి శక్తశుద్ధి లేదని, అమలు కానీ హామీలను పక్కనపెట్టి ప్రజా సమస్యల చేయాలని వారు అన్నారు.ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి వేముల భిక్షం, సీనియర్ నాయకులు రచ్చ గోవర్ధన్, మండల కమిటీ సభ్యులు రాసమల్ల సత్తయ్య , తుమ్మల సత్యనారాయణ రెడ్డి, మల్లెల శ్రీశైలం, ఏపూరి బుగ్గ రాములు, భాష బోయిన రాములు తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *