మార్చి 24, నేటి తెలుగు పత్రిక: పాన్ ఇండియా స్థాయిలో బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతున్న ధురంధర్ 2 సినిమాపై సూపర్ స్టార్ రజినీకాంత్ చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్గా మారింది.డైరెక్టర్ ఆదిత్య ధర్ దర్శకత్వంలో, రణవీర్ సింగ్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటికే రూ.500 కోట్ల క్లబ్లో చేరి భారీ విజయాన్ని నమోదు చేసింది. రోజురోజుకీ కలెక్షన్లు పెరుగుతూ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ సృష్టిస్తోంది.ఇప్పటికే టాలీవుడ్ స్టార్ హీరోలు మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్ ఈ సినిమాపై ప్రశంసలు కురిపించగా, తాజాగా రజినీకాంత్ కూడా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఈ సినిమాను “బాక్సాఫీస్ కా బాప్”గా అభివర్ణిస్తూ, ప్రతి భారతీయుడు తప్పక చూడాల్సిన చిత్రమని ట్వీట్ చేశారు.రజినీకాంత్ ట్వీట్పై స్పందించిన ఆదిత్య ధర్ భావోద్వేగానికి లోనయ్యారు. రజినీకాంత్ను తాము ఎప్పటి నుంచో ఆదర్శంగా చూసుకుంటూ పెరిగామని, ఆయన నుంచి ప్రశంసలు అందుకోవడం తన జీవితంలో అతిపెద్ద క్షణమని అన్నారు. ప్రేక్షకులను దశాబ్దాలుగా అలరిస్తున్న సూపర్ స్టార్ నుంచి వచ్చిన ఈ ప్రశంసలు తమకు ప్రేరణనిచ్చాయని పేర్కొన్నారు. ప్రస్తుతం రజినీకాంత్, ఆదిత్య ధర్ ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
