Breaking News

కొత్త యజమానుల చేతుల్లోకి రాజస్థాన్ రాయల్స్.. రికార్డ్ ధరకు డీల్

మార్చి 24, నేటి తెలుగు పత్రిక: ఐపీఎల్ చరిత్రలోనే అతిపెద్ద డీల్ కుదిరింది. రాజస్థాన్ రాయల్స్ జట్టు సుమారు 1.65 బిలియన్ డాలర్లు (రూ.15,000 కోట్లు)కు అమ్ముడై సంచలనం సృష్టించింది.అమెరికాకు చెందిన భారత సంతతి వ్యాపారవేత్త కాల్ సోమాని నేతృత్వంలోని కన్సార్టియం ఈ జట్టును సొంతం చేసుకుంది. ఈ డీల్‌తో ఐపీఎల్ ఫ్రాంచైజీలలో ఇప్పటివరకు నమోదైన అత్యధిక అమ్మకంగా ఇది రికార్డు సృష్టించింది. ఈ కన్సార్టియంలో వాల్‌మార్ట్ వారసుడు రాబ్ వాల్టన్, ఫోర్డ్ మోటార్ కంపెనీ కుటుంబానికి చెందిన షీలా ఫోర్డ్ హాంప్ వంటి ప్రముఖులు భాగస్వాములుగా ఉన్నారు. స్పోర్ట్స్ బిజినెస్‌లో వీరికి ఉన్న అనుభవం జట్టుకు కీలకంగా మారనుంది.

2027 వరల్డ్ కప్‌పై ఫోకస్.. ఆరుగురు పేసర్లకు చోటు ఫిక్స్! షమీకి షాక్?

ఇప్పటివరకు జట్టులో మెజారిటీ వాటా కలిగి ఉన్న మనోజ్ బదాలే సహా పాత యాజమాన్యం పూర్తిగా బయటకు వెళ్లగా, కొత్త బృందం 100% వాటాను స్వాధీనం చేసుకుంది.ఇండియన్ ప్రీమియర్ లీగ్ తొలి సీజన్ (2008) ఛాంపియన్‌గా నిలిచిన రాజస్థాన్ రాయల్స్, కొత్త యాజమాన్యం రాకతో గ్లోబల్ స్థాయిలో బ్రాండ్ విలువను పెంచే దిశగా అడుగులు వేయనుంది.మొత్తం మీద, ఈ మెగా డీల్ ఐపీఎల్ మాత్రమే కాకుండా ప్రపంచ స్పోర్ట్స్ బిజినెస్‌లోనూ హాట్ టాపిక్‌గా మారింది.

SRH ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. జట్టులోకి ఇద్దరు స్టార్ ప్లేయర్లు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *