Breaking News

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల వ్యవహారంలో ట్విస్ట్.. హైకోర్టు నోటీసులు జారీ

మార్చి 25, నేటి తెలుగు పత్రిక: తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపుతున్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణ హైకోర్టు ఏడుగురు ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది. అలాగే తెలంగాణ అసెంబ్లీ స్పీకర్కూ నోటీసులు పంపింది.ఇటీవల 10 మంది బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారలేదని స్పీకర్ తీర్పు ఇవ్వగా, ఆ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలైంది. ఈ నేపథ్యంలో దానం నాగేందర్, అరికేపూడి గాంధీ, కాలే యాదయ్య, ప్రకాష్ గౌడ్, పోచారం, బండ్ల కృష్ణమహన్‌రెడ్డి, తెల్లం వెంకట్రావులపై పిటిషన్ విచారణకు వచ్చింది.ఈ కేసులో స్పందిస్తూ హైకోర్టు సంబంధిత ఎమ్మెల్యేలకు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. కేసు తదుపరి విచారణను వచ్చే నెల 16వ తేదీకి వాయిదా వేసింది.స్పీకర్ నిర్ణయంపై న్యాయపరమైన పోరాటం కొనసాగుతుండగా, ఈ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో మరింత చర్చనీయాంశంగా మారింది.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *