మార్చి 25, నేటి తెలుగు పత్రిక: జనసేన పార్టీ బొలిశెట్టి సత్యనారాయణపై కీలక నిర్ణయం తీసుకుంది. ఆయనతో పార్టీకి ఇకపై ఎలాంటి సంబంధం లేదని స్పష్టంగా ప్రకటించింది.బొలిశెట్టి సత్యనారాయణ చేపట్టే కార్యక్రమాలకు పార్టీకి ఎలాంటి సంబంధం లేదని జనసేన విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. దీంతో ఆయనపై పార్టీ వేటు వేసినట్లుగా భావిస్తున్నారు.ఇటీవల విశాఖపట్నంలోని పావురాల కొండ పర్యావరణ విధ్వంసంపై బొలిశెట్టి ప్రశ్నలు లేవనెత్తారు. అలాగే కొల్లేరు ప్రాంతంలో కాంట్రాక్టర్లకు మేలు చేసేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. అంతేకాకుండా, కూటమిలో భాగమైన తెలుగుదేశం పార్టీ చర్యలపై కూడా ఆయన ఇటీవల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో జనసేన ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.ఈ ఘటన కూటమి రాజకీయాల్లో కొత్త చర్చలకు దారి తీస్తోంది.
