మార్చి 25, నేటి తెలుగు పత్రిక: టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ యుగంలో, మనుషుల మధ్య సంబంధాల స్వభావం కూడా మారుతోంది. ముఖ్యంగా కృత్రిమ మేధస్సు (AI) ప్రభావంతో, తోడు కోసం యువత కొత్త మార్గాలను అన్వేషిస్తోంది.తాజాగా Joi AI నిర్వహించిన సర్వే ప్రకారం, 83 శాతం మంది జెన్ జీ యువత AIతో కూడా బలమైన భావోద్వేగ అనుబంధం ఏర్పరచుకోవచ్చని నమ్ముతున్నారు. ఇది నేటి సమాజంలో మారుతున్న భావజాలాన్ని ప్రతిబింబిస్తోంది.
ఎందుకు AI వైపు మొగ్గు?
నిజ జీవిత సంబంధాల్లో ఎదురయ్యే నిరాశ, ఒత్తిడి, జడ్జ్మెంట్ భయం యువతను AI చాట్బాట్ల వైపు నడిపిస్తున్నాయి.
- 24/7 అందుబాటు
- విమర్శలు లేని వినికిడి
- వ్యక్తిగత అభిరుచులకు అనుగుణంగా స్పందన
ఈ లక్షణాలు యువతను ఆకర్షిస్తున్నాయి.
దాగి ఉన్న ప్రమాదాలు
అయితే నిపుణులు హెచ్చరిస్తున్నదేమిటంటే, ఇది ఒక “కృత్రిమ భ్రమ” మాత్రమే.54% మంది దీనిని సానుకూలంగా చూడగా, 41% మంది మాత్రం అసౌకర్యంగా భావిస్తున్నారు.AI సలహాలు ఇవ్వగలిగినా, నిజమైన మానవ సంబంధాల్లో ఉండే ఆత్మీయత, సహజత్వం, భావోద్వేగ గాఢతను భర్తీ చేయలేడు. ఈ పరిస్థితి వాస్తవం–భ్రమ మధ్య గీతను చెరిపేసి, మరింత ఒంటరితనానికి దారితీయొచ్చు.
మానసిక ప్రభావం
AIపై ఆధారపడటం వల్ల భవిష్యత్తులో మానసిక ఒత్తిడి, సామాజిక దూరం పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.మొత్తంగా, టెక్నాలజీ మన జీవితాలను సులభతరం చేయాల్సిందే కానీ, మనుషుల మధ్య ఉన్న అనుబంధాలను తగ్గించకూడదు. స్క్రీన్లలో కాదు.. నిజమైన మనుషులతో సంబంధాలే దీర్ఘకాల సంతోషానికి మార్గమని నిపుణులు సూచిస్తున్నారు.
