మార్చి 25, నేటి తెలుగు పత్రిక: నిజామాబాద్ జిల్లాలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పర్యటనకు సిద్ధమయ్యారు. శుక్రవారం (27వ తేదీ) ఉదయం 8 గంటలకు నిజామాబాద్లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో కీలక ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో పలు సమకాలీన రాజకీయ అంశాలపై ఆమె స్పందించే అవకాశం ఉంది.అనంతరం ఉదయం 9:30 గంటలకు శ్రీ రఘునాథ ఆలయం (ఖిల్లా రాంమందిర్)లో జరిగే శ్రీరామ నవమి సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణోత్సవంలో పాల్గొననున్నారు.ఈ పర్యటన రాజకీయంగా కూడా ప్రాధాన్యత సంతరించుకునే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
