Breaking News

టీడీపీ నేత ఇంటి పెళ్లి.. లోకేష్, రేవంత్ రెడ్డి ఒకే వేదికపై

మార్చి 25, నేటి తెలుగు పత్రిక: టీడీపీ సీనియర్ నేత, పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్తె వివాహ వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు.గుంటూరులోని శ్రీ కన్వెన్షన్‌లో జరిగిన ఈ వివాహ వేడుకకు ఎ. రేవంత్ రెడ్డి కూడా కుటుంబంతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి లోకేష్ ఆహ్వానం పలికారు.అనంతరం నూతన వధూవరులు నాగసాయి వైదీప్తి, కెవిన్ రామ్‌లను ఆశీర్వదించి, పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొని వేడుకను మరింత వైభవంగా మార్చారు. రాజకీయ ప్రముఖుల సమక్షంలో జరిగిన ఈ వివాహ వేడుక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

పోక్సో కేసులో హైకోర్టును ఆశ్రయించిన బండి భగీరథ్

‘భోగి’లో డింపుల్ హయతి పవర్‌ఫుల్ లుక్ వైరల్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *