హైదరాబాద్, మార్చి 25, నేటి తెలుగు పత్రిక: మియాపూర్లో చైన్ స్నాచింగ్ ఘటన కలకలం రేపింది. ఇంటర్నెట్ కనెక్షన్ పేరుతో ఇంట్లోకి ప్రవేశించిన ఓ దుండగుడు ఒంటరిగా ఉన్న మహిళపై దాడికి పాల్పడ్డాడు.మహిళను కత్తితో బెదిరించి, పెప్పర్ స్ప్రే ఉపయోగించి ఆమెను అశక్తురాలిగా మార్చిన అనంతరం మెడలో ఉన్న సుమారు 4 తులాల బంగారు గొలుసును లాక్కెళ్లాడు.ఘటన అనంతరం నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.ఈ ఘటనతో ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి. పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు.
