మార్చి 25, నేటి తెలుగు పత్రిక: వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మహిళల సాధికారతపై కీలక వ్యాఖ్యలు చేశారు. తమ పాలనలో మహిళలకు పెద్దపీట వేశామని, పదవుల్లోనూ, కాంట్రాక్టు పనుల్లోనూ రిజర్వేషన్లు కల్పించినట్లు తెలిపారు.ఇప్పుడు చట్టసభల్లో కూడా మహిళలకు మరిన్ని సీట్లు రాబోతున్నాయని ఆయన పేర్కొన్నారు. సీట్లు పెరగడం వల్ల పార్టీ కార్యకర్తలకు నాయకులుగా ఎదగడానికి మంచి అవకాశాలు లభిస్తాయని చెప్పారు.“పార్టీలో కష్టపడే వారికి, పటిమ చూపించే వారికి సీట్ల కేటాయింపులో ప్రాధాన్యం ఇస్తాం” అని జగన్ స్పష్టం చేశారు.అదేవిధంగా ‘జగన్ 2.0’లో కార్యకర్తలకు మరింత ప్రాధాన్యం ఉంటుందని తెలిపారు. కార్యకర్తలకు న్యాయం జరిగితేనే ప్రజలకు మంచి జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.మొత్తంగా, మహిళలు మరియు పార్టీ కార్యకర్తలకు భరోసా ఇస్తూ జగన్ కీలక సందేశం ఇచ్చారు.
