ఎ. కొండూరు మార్చి 25 (నేటి తెలుగు పత్రిక): రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర భూ సర్వే కార్యక్రమం అమలుపై ఎన్టీఆర్ జిల్లా జెసి ఇలక్కియా బుధవారం ఎ.కొండూరు మండలంలో ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. మండల కేంద్రమైన ఎ.కొండూరులోని పాత సినిమా హాల్ వద్ద కొద్దిసేపు ఆగి అక్కడ జరుగుతున్న భూసర్వే పనుల పై మండలతహశీల్దార్ ఎన్.అరవింద్ తోకలసి పనులపురోగతిని పరిశీలించారు.ఈ సందర్భంగా సర్వే సిబ్బందితో మాట్లాడి భూ సర్వే ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. గ్రామాల్లో భూముల సరిహద్దులు ఖచ్చితంగా గుర్తించడం, భూ యజమానుల వివరాలను సక్రమంగా నమోదు చేయడం, ఎటువంటి వివాదాలు లేకుండా పారదర్శకంగా సర్వే నిర్వహించాలని ఆదేశించారు.అలాగే సర్వే పనుల్లో ఉపయోగిస్తున్న పరికరాలు, మ్యాపింగ్ విధానాలను కూడా జేసి పరిశీలించారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సిబ్బంది పని చేయాలని సూచించారు.స్థానిక ప్రజలు కూడా భూ సర్వే కార్యక్రమానికి సహకరించాలనికోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ దివ్య ప్రసాద్ సర్వే నిర్వహిస్తున్న సిబ్బంది పాల్గొన్నారు.

