Breaking News

మార్కాపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. సీఎం రేవంత్ దిగ్భ్రాంతి

మార్చి 26, నేటి తెలుగు పత్రిక: నిర్మల్ నుంచి నెల్లూరుకు వెళ్తున్న ప్రైవేట్ బస్సు మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలో రోడ్డు ప్రమాదానికి గురైన ఘటనపై ఎ. రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులు మృతి చెందిన ఘటనపై సీఎం తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు.ప్రమాదంలో గాయపడిన వారికి తక్షణమే మెరుగైన వైద్య చికిత్స అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.ఇదిలా ఉండగా, ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు ఆంధ్రప్రదేశ్ అధికారులతో మాట్లాడి సహాయక చర్యలపై సమన్వయం చేస్తున్నట్లు సమాచారం.ఈ ఘటనపై రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు అప్రమత్తమై సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి.

గీత కార్మికులపై హరీష్‌రావు ఫైర్.. సహాయం ఎక్కడ?

కుటుంబాన్ని పరామర్శించిన జిల్లా ప్రజా పరిషత్ మాజీ అధ్యక్షులు శ్రీ ఎలిమినేటి సందీప్ రెడ్డి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *