హైదరాబాద్, మార్చి 26, నేటి తెలుగు పత్రిక: మందుబాబులకు బ్యాడ్ న్యూస్. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో మద్యం దుకాణాలు తాత్కాలికంగా మూసివేయనున్నారు. శ్రీరామనవమి సందర్భంగా మార్చి 27న డ్రై డే ప్రకటిస్తూ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు వైన్స్ షాపులు, బార్లు, కల్లు దుకాణాలు, స్టార్ హోటళ్లలో మద్యం అమ్మకాలు పూర్తిగా నిలిపివేయనున్నారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఈ నిషేధం అమల్లో ఉంటుందని పోలీసులు వెల్లడించారు. పండుగ సందర్భంగా శాంతిభద్రతలను కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.డ్రై డే నేపథ్యంలో మద్యం ప్రియులు ముందుగానే కొనుగోళ్లకు మొగ్గు చూపుతున్నారు.
