Breaking News

మందుబాబులకు షాక్.. హైదరాబాద్‌లో వైన్స్, బార్లు బంద్!

హైదరాబాద్, మార్చి 26, నేటి తెలుగు పత్రిక: మందుబాబులకు బ్యాడ్ న్యూస్. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో మద్యం దుకాణాలు తాత్కాలికంగా మూసివేయనున్నారు. శ్రీరామనవమి సందర్భంగా మార్చి 27న డ్రై డే ప్రకటిస్తూ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు వైన్స్ షాపులు, బార్లు, కల్లు దుకాణాలు, స్టార్ హోటళ్లలో మద్యం అమ్మకాలు పూర్తిగా నిలిపివేయనున్నారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఈ నిషేధం అమల్లో ఉంటుందని పోలీసులు వెల్లడించారు. పండుగ సందర్భంగా శాంతిభద్రతలను కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.డ్రై డే నేపథ్యంలో మద్యం ప్రియులు ముందుగానే కొనుగోళ్లకు మొగ్గు చూపుతున్నారు.

రైల్ రోకో కేసులో కల్వకుంట్ల కవితకు సికింద్రాబాద్ రైల్వే కోర్టు సమన్లు

పని మనుషుల వివరాలు పోలీస్ స్టేషన్‌లో నమోదు చేయాలి: హైదరాబాద్ పోలీసులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *