Breaking News

మార్కాపురం ఘోరం.. ప్రధాని మోదీ దిగ్భ్రాంతి, పరిహారం ప్రకటన

మార్చి 26, నేటి తెలుగు పత్రిక: మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో 13 మంది సజీవదహనం కావడం పట్ల ఆయన గాఢ సంతాపం తెలిపారు.గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన ప్రధాని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా, గాయపడిన వారికి రూ.50 వేల ఆర్థిక సహాయం ప్రకటించారు.జగిత్యాల నుంచి నెల్లూరు వైపు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు టిప్పర్‌ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఢీకొట్టిన వెంటనే టిప్పర్ డీజిల్ ట్యాంక్ నుంచి మంటలు చెలరేగి బస్సు పూర్తిగా అగ్నికి ఆహుతైంది.ఈ ఘటనలో పలువురు ప్రయాణికులు సజీవదహనమవగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.ఈ దుర్ఘటనతో బాధిత కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి.

ట్రాన్స్‌జెండర్ల సంక్షేమానికి ఏపీ సర్కార్ కీలక అడుగు

రైతులకు అన్యాయం సహించబోం: అచ్చెన్నాయుడు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *