మార్చి 26, నేటి తెలుగు పత్రిక: హరీష్ రావు గీత కార్మికుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా ప్రశ్నించారు. శాశ్వత అంగవైకల్యం కలిగిన గీత కార్మికులకు ప్రభుత్వం నుండి సహాయం అందిస్తామని పేర్కొంటూనే, వాస్తవంగా సహాయం అందడం లేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండున్నర సంవత్సరాల్లో గీత కార్మికులకు ఆర్థిక సహాయం ఎందుకు ఆగిపోయిందని ఆయన ప్రశ్నించారు. అలాగే ఎ. రేవంత్ రెడ్డి ఒక సభలో రెండు రోజుల్లో గీత కార్మికులకు ఆర్థిక సహాయం అందిస్తామని ప్రకటించినప్పటికీ, ఇప్పటికీ డబ్బులు అందలేదని హరీష్రావు పేర్కొన్నారు.ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత మంది గీత కార్మికులు ప్రమాదాలకు గురయ్యారు? అందులో ఎంత మందికి సహాయం చేశారు? ఇంకా ఎప్పటి వరకు ఆర్థిక సహాయం అందిస్తారో స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.గీత కార్మికుల సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని హరీష్రావు కోరారు.
