Breaking News

మార్కాపురం బస్సు ప్రమాద ఘటన పై ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ దిగ్భ్రాంతి

మార్చి 26, నేటి తెలుగు పత్రిక: మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలో చోటుచేసుకున్న ఘటనపై ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న పలువురు సజీవ దహనం కావడం అత్యంత విషాదకరమని ఆయన పేర్కొన్నారు. ఈ ఘటన జరిగిన వెంటనే మంత్రి గొట్టిపాటి రవి కుమార్ సంబంధిత అధికారులతో, స్థానిక ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డితో ఫోన్ లో మాట్లాడి, ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులకు ఆదేశించారు. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు మంత్రి గొట్టిపాటి రవి కుమార్ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అలాగే, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని మంత్రి ఆకాంక్షించారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

సీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనిత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *