Breaking News

బస్సు ప్రయాణం ఇక సులభం.. రాష్ట్రానికి ఈ-బస్సుల వరద

మార్చి 26, నేటి తెలుగు పత్రిక: ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త. ఆంధ్రప్రదేశ్లో బస్సు ప్రయాణాన్ని మరింత సులభతరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.PM e-Bus Sewa Scheme కింద రాష్ట్రానికి తొలి విడతగా 750 ఎలక్ట్రిక్ బస్సులను అందించనుంది. దీంతో రద్దీ, కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణం కల్పించనుంది.ఈ బస్సులను రాష్ట్రంలోని ప్రధాన నగరాలు అయిన విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, తిరుపతి తదితర 11 నగరాల్లో ప్రవేశపెట్టనున్నారు.ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ కోసం అవసరమైన ఛార్జింగ్ స్టేషన్లు, మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఇందుకోసం సుమారు రూ.129.51 కోట్ల వ్యయం చేయనున్నారు. ఇందులో 60 శాతం నిధులు కేంద్రం, మిగతా 40 శాతం రాష్ట్ర ప్రభుత్వం భరించనుంది. ఈ ఈ-బస్సులు అందుబాటులోకి వస్తే ఏపీ రవాణా వ్యవస్థలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి.

రాష్ట్ర ప్రజలకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపిన మాజీ సీఎం జగన్

అమరావతిపై సజ్జల సంచలన వ్యాఖ్యలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *