మార్చి 26, నేటి తెలుగు పత్రిక: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. ప్రముఖ ప్రైవేట్ ఇంధన సంస్థ Nayara Energy లీటరుకు పెట్రోల్పై రూ.5 వరకు, డీజిల్పై రూ.3 వరకు ధరలను పెంచింది.ఈ ధరల పెంపుకు ప్రధాన కారణంగా పశ్చిమ ఆసియాలో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతలు నిలిచాయి. West Asiaలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి. ప్రస్తుతం క్రూడ్ ఆయిల్ ధరలు బ్యారెల్కు 119 డాలర్లకు చేరుకోవడంతో దిగుమతి ఖర్చులు పెరిగాయి.ప్రభుత్వ రంగ సంస్థలకు భిన్నంగా ప్రైవేట్ కంపెనీలకు సబ్సిడీలు లేకపోవడంతో, పెరిగిన వ్యయాన్ని వినియోగదారులపై మోపాల్సి వచ్చిందని నిపుణులు చెబుతున్నారు. రాష్ట్రాల వారీగా పన్నులు, VAT ప్రభావంతో ధరల పెంపు స్థాయి మారుతోంది. కొన్ని ప్రాంతాల్లో పెట్రోల్ ధరలు లీటరుకు రూ.5.30 వరకు పెరిగినట్లు సమాచారం.ఇదిలావుంటే, Reliance Industries-BP భాగస్వామ్య సంస్థ ‘జియో-బిపి’తో పాటు ప్రభుత్వ రంగ సంస్థలు ప్రస్తుతం ధరలను యథాతథంగా కొనసాగిస్తున్నాయి.ఇక యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో సరఫరా అంతరాయం కలగొచ్చన్న భయంతో హైదరాబాద్ వంటి నగరాల్లో పెట్రోల్ బంక్ల వద్ద వాహనదారులు క్యూ కడుతున్నారు. అయితే దేశంలో చమురు నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని, దిగుమతులు విభిన్న దేశాల నుంచి జరుగుతున్నాయని అధికారులు స్పష్టం చేస్తున్నారు. మొత్తంగా, అంతర్జాతీయ పరిణామాల ప్రభావం భారత ఇంధన మార్కెట్పై స్పష్టంగా కనిపిస్తోంది.
