Breaking News

అమరావతిపై సజ్జల సంచలన వ్యాఖ్యలు

మార్చి 26, నేటి తెలుగు పత్రిక: సజ్జల రామకృష్ణారెడ్డి అమరావతి రాజధాని అంశంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధాని చట్టబద్ధత విషయంలో అసెంబ్లీలో తీర్మానం చేయాల్సిన అవసరం ఏమిటో ప్రభుత్వం స్పష్టంచేయాలని డిమాండ్ చేశారు.చట్టబద్ధత కల్పించాలంటే శాసనసభతో పాటు మండలిలో కూడా చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. అమరావతిలో భారీ స్థాయిలో అవినీతి జరుగుతోందని ఆరోపించారు.ప్రత్యేకంగా టెండర్ల వ్యవహారాన్ని గోప్యంగా ఉంచడం అనుమానాలకు తావిస్తోందని, పారదర్శకత లేకపోవడంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.అమరావతిలో జరుగుతున్న అవినీతిని ప్రశ్నిస్తే తమను రాజధానికి వ్యతిరేకంగా చిత్రీకరించడం సరికాదని సజ్జల అన్నారు. తాము అమరావతికి వ్యతిరేకం కాదని, అవినీతికి మాత్రమే వ్యతిరేకమని స్పష్టం చేశారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

సీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనిత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *