మార్చి 26, నేటి తెలుగు పత్రిక: వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు శ్రీరామ నవమి సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.సీతారాముల దీవెనలతో రాష్ట్ర ప్రజలందరికీ సకల శుభాలు కలగాలని ఆకాంక్షించారు. అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాల్లో నవమి వేడుకలను ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు.ప్రత్యేకంగా ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయం, భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో జరిగే ఉత్సవాలను భక్తులు భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని సూచించారు. సీతారాముల ఆశీస్సులతో రాష్ట్రానికి శాంతి, సమృద్ధి కలగాలని ఈ సందర్భంగా జగన్ కోరుకున్నారు.
