కోదాడ, మార్చ్ 26 (నేటి తెలుగు పత్రిక): రాబోయే వానకాల పంటలకు రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందుకు చర్యలు చేపట్టాలని కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ వేపూరి తిరుపతమ్మ సుధీర్ కోరారు గురువారం మండల కేంద్రంలో కోపరేటివ్ బ్యాంక్ సహకార సంఘం వారి ఆధ్వర్యంలో నిర్వహించిన సర్వసభ సమావేశంలో పాల్గొని వారు మాట్లాడుతూ రాబోయే వానాకాలం పంటలకు యూరియాతోపాటు సొసైటీ ఆధ్వర్యంలో రైతులుకి అందించే దుక్కిమందు జింకు వ్యవసాయ పనిముట్లను రైతులకు అందుబాటులో ఉండే విధంగా ముందస్తు ప్రణాళికలతో నివేదికను ప్రభుత్వానికి అందించాలన్నారు.ఏకకాలంలో రైతులకు రుణమాఫీ చేసి సన్న వడ్లకు 500 రూపాయలు బోనస్ తో పాటు రైతుల పంటకు పెట్టుబడి అందిస్తున్న ఘనత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వందే అన్నారు కేంద్ర ప్రభుత్వం ముందు చూపు లేకపోవడం వల్ల రాష్ట్రంలో యూరియా కొరత ఏర్పడిందన్నారు మోడీ ప్రభుత్వం కుబేరులకు కొమ్ముకాస్తూ దేశంలో రైతులను అణచివేస్తుందన్నారు.కార్యక్రమంలో సీఈవో కిరణ్ కుమార్ రెడ్డి, పర్సనల్ ఆఫీసర్ చంద్రకళ, కార్యాలయ సిబ్బంది శీను, ఉపేందర్, బీరవెల్లి సుధాకర్ రెడ్డి, సైదులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
