Breaking News

మార్కాపురం బస్సు ప్రమాద బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది..!

విజయవాడ. మార్చి 26 సెంట్రల్ నేటి తెలు గు పత్రిక ప్రతినిధి: మార్కాపురం సమీపంలో జరిగిన ఘోర బస్సు ప్రమాద ఘటనపై రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఆయన వెంటా జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ పి. రాజబాబు, ఎస్పీ హర్షవర్ధన్ రాజు, ఎమ్మెల్యే నారాయణరెడ్డి ఉన్నారు. ఘటనపై వెంట నే స్పందించిన అధికారులు గోల్డెన్ అవర్‌లోనే ప్రమాద స్థలానికి చేరుకు ని పలువురిని రక్షించిన ట్లు మంత్రి తెలిపారు.ఈ ప్రమాదంలో మొత్తం 13 మంది మృతి చెందిన ట్లు, మరో 28 మందిని ఆసుపత్రుల్లో చేర్చినట్లు మంత్రి వెల్లడించారు. బస్సులో మొత్తం 41 మంది ప్రయాణిస్తున్నట్లు సమాచారం అందిందని, సీరియస్‌గా గాయపడిన కొంతమందిని మెరుగైన చికిత్స కోసం ఒంగోలుకు తరలించినట్లు చెప్పారు. మృతుల కుటుంబాలకు, గాయపడిన వారికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని మంత్రి హామీ ఇచ్చారు. వైద్య ఖర్చులను పూర్తిగా ప్రభుత్వం భరిస్తుందని స్పష్టం చేశారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుడా రాబోయే రోజుల్లో భద్రతా ప్రమాణాలనుమరింత కఠినతరం చేస్తామని మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి తెలిపారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలను నిపుణుల కమిటీ ద్వారా త్వరలో వెల్లడిస్తా మని పేర్కొన్నారు.

విశాఖ తీరానికి చేరిన భారీ LPG, చమురు నౌకలు… ఇంధన సంక్షోభానికి ఊరట

ఈవీఎం, వీవీప్యాట్ గోదాముకు ప‌టిష్ట భ‌ద్ర‌త‌: జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *