కోదాడ ,మార్చి 26(నేటి తెలుగు పత్రిక): కోదాడ మున్సిపల్ పరిధి లోని 19 వార్డు లో గుడిబండ రోడ్డు, వార్డు పరిధి లోని పలు వీధుల్లో డ్రైనేజీ సమస్యల ను అవార్డు కౌన్సిలర్ కొల్ల కోటి రెడ్డి గురు వారం మునిసిపల్ చైర్ పర్సన్ కుసుమ వెంకట్ రత్నం బాబు, కమిషనర్ రమాదేవి లకు క్షేత్ర స్థాయిలో చూపించారు. వార్డు లో డ్రైనేజీ సమస్య ప్రధానంగా ఉందని వెంటనే నిధులు మంజూరు నిధులు మంజూరు చేయించి పరిష్కరించాలని కోరారు. వార్డు సమస్యలను పరిశీలించిన మున్సిపల్ చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. సమస్య పరిష్కారానికి కార్యాచరణను సిద్ధం చేయాలని కమిషనర్ రమాదేవికి సూచించారు. పట్టణంలోని అన్ని వార్డుల్లో పారిశుద్ధ్య మే ప్రధాన లక్ష్యమని చైర్ పర్సన్ పేర్కొన్నారు. మంచినీటి ఎద్దడి నివారణ కూడా చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. కౌన్సిలర్లు ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకువస్తే ఎమ్మెల్యే పద్మావతి సహకారంతో సమస్యలను పరిష్కరిస్తారు అన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ రమాదేవి మునిసిపల్ కౌన్సిలర్ కొల్ల కోటిరెడ్డి వార్డు సిబ్బంది ఉన్నారు.
