- బిఆర్ఎస్ యాదగిరిగుట్ట పట్టణ సెక్రటరీ జనరల్ పాపట్ల నరహరి .
యాదగిరిగుట్ట : మార్చి 25 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): నాలా గోతులలో పడి జంగాల కాలనీ వాసులకు ప్రతిరోజు ప్రమాదాలు జరుగుతున్నాయని బి ఆర్ ఎస్ ఎదురుగుండా పట్టణ సెక్రెటరీ జనరల్ పాపట్ల నరహరి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సమస్య ను మున్సిపల్ చైర్మన్ , కమిషనర్ తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాం అని తెలిపారు. యాదగిరిపల్లి 2 వ వార్డులో కాలనీవాసులు , స్థానికులు కాలనీలోకి వెళ్లడానికి దారి లేక అవస్థలు అవస్థలు పడుతున్నారని ఆయన అన్నారు.తక్షణమే నాలాకు మరమ్మతులు చేసి రోడ్లు వేయాలి . తక్షణమే సమస్యను పరిష్కరించకపోతే యాదగిరి పల్లి చౌరస్తా లో భారీ ఎత్తున ధర్నా, ఉద్యమం నిర్వహిస్తామని తెలిపారు.ఇట్టి కార్యక్రమంలో కాలనీవాసులు పాల్గొన్నారు.
