అమరావతి, మార్చి 27, నేటి తెలుగు పత్రిక: శ్రీరామనవమి సందర్భంగా ప్రముఖ నేత నారా లోకేష్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన శ్రీరాముడి మహిమను వివరించారు.ధర్మానికి ప్రతిరూపంగా నిలిచిన శ్రీరామచంద్రుడు ప్రజలకు ఆదర్శమని పేర్కొన్నారు. సుపరిపాలనకు రామరాజ్యం శాశ్వత నమూనా అని చెప్పారు. సమాజంలో న్యాయం, ధర్మం నెలకొల్పడంలో శ్రీరాముడి పాత్ర ఎంతో గొప్పదని అభిప్రాయపడ్డారు.లోకకళ్యాణం కోసం సీతారాముల కల్యాణం ఘనంగా, శాంతియుతంగా జరగాలని ఆకాంక్షించారు. ఈ పవిత్ర పర్వదినం ప్రతి ఇంటికి సుఖశాంతులు తీసుకురావాలని కోరుకున్నారు.శ్రీరామనవమి పర్వదినం ప్రజలందరికీ ఆనందం, ఐశ్వర్యం నింపాలని ఆయన తన సందేశంలో ఆకాంక్షించారు.
