Breaking News

ధర్మం, సుపరిపాలనకు ప్రతీక శ్రీరాముడు: చంద్రబాబు

అమరావతి, మార్చి 27, నేటి తెలుగు పత్రిక: శ్రీరామనవమి మహోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన శ్రీరాముడి మహిమను కొనియాడుతూ, ధర్మానికి, సుపరిపాలనకు ప్రతీకగా నిలిచిన ఆదర్శ పురుషుడు శ్రీరామచంద్రుడని పేర్కొన్నారు. కర్తవ్యపరాయణత, న్యాయం, నీతి విలువలను పాటించిన మహానుభావుడిగా ఆయనను అభివర్ణించారు.శ్రీరాముడు అవతరించిన రోజు, ఆయన కళ్యాణం జరిగిన రోజు అయిన శ్రీరామనవమిని ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారని తెలిపారు. రామరాజ్యం అంటే ప్రజల కోసం పనిచేసే పరిపాలన అని, అలాంటి సమాజాన్ని నిర్మించేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యత నిర్వర్తించాల్సిన అవసరం ఉందన్నారు.ప్రతి ఒక్కరూ శ్రీరామచంద్రమూర్తి సుగుణాలను ఆచరిస్తూ ఆదర్శ జీవితం గడపాలని, ప్రజలందరికీ శాంతి, సుఖసమృద్ధులు కలగాలని కోరుకున్నారు. ఈ పవిత్ర పర్వదినం ప్రతి ఇంటిలో ఆనందం నింపాలని, శ్రీరాముడి కృపాకటాక్షం అందరికీ లభించాలని సీఎం ఆకాంక్షించారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

సీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనిత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *