సూర్యాపేట ,మార్చి 27(నేటి తెలుగు పత్రిక); సూర్యాపేట పట్టణంలోని బాలేoల గ్రామంలో సంగని వెంచర్స్ అధినేత సంగని రజనీకాంత్ ఆధ్వర్యంలో శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది.సంగని రజనీకాంత్ అమ్మ సంగని అహల్య తో కలిసి కళ్యాణం ఘనంగా జరిపించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు ఇంద్రశేకర్ ,సందీప్ ,సంగని ప్రవీణ్ ,గంట సోమయ్య ,గాలి వినయ్ ,కటకం గణేష్ ,గోపి, ఎరుకల సందీప్, బ్రహ్మచారి ,రవి, నాగరాజు ,నవీన్ ,శేఖర్ ,వీరయ్య తదితరులు పాల్గొన్నారు.





