Breaking News

ఎక్సైజ్ సుంకం తగ్గింపుకు చంద్రబాబు స్వాగతం

మార్చి 27, నేటి తెలుగు పత్రిక: ఇంధనంపై ఎక్సైజ్ సుంకం తగ్గించిన కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని చంద్రబాబు స్వాగతించారు. ఇది ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని తీసుకున్న బలమైన నిర్ణయం అని ఆయన పేర్కొన్నారు.కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ తరఫున అభినందిస్తున్నామని తెలిపారు. పెట్రోల్, డీజిల్ ధరలపై భారాన్ని తగ్గించే ఈ చర్యతో ప్రజలకు గణనీయమైన ఊరట లభిస్తుందని అభిప్రాయపడ్డారు.సంక్షోభ సమయంలోనే నిజమైన నాయకత్వం బయటపడుతుందని చెప్పిన చంద్రబాబు, నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం స్థిరత్వం వైపు ముందుకు సాగుతోందని అన్నారు.ఇంధన ఎక్సైజ్ సుంకం తగ్గింపుతో సామాన్య ప్రజలకు ఉపశమనం కలుగుతుందని, ఇది ఆర్థిక వ్యవస్థకు కూడా మేలు చేస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

సీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనిత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *