Breaking News

వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజల ప్రయాణికుల సౌకర్యార్థం గోపాలపురం గ్రామంలో చలివేంద్రం ప్రారంభం.

ఎ.కొండూరు మార్చి 27 (నేటి తెలుగు పత్రిక): వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని మండుటెండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రయాణికులు, గ్రామ ప్రజలకు చల్లని తాగునీరు అందించాలనే ఉద్దేశంతో ఎ.కొండూరు మండలం గోపాలపురం గ్రామంలో శ్రీ కమలి బాబా ఆశ్రమం ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ప్రారంభించారు.ఈ చలివేంద్రాన్ని ఎ.కొండూరు మండల తహశీల్దార్‌ ఎన్, అరవింద్ రాష్ట్ర మాదిగ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ వాసం మునియ్య శుక్రవారం చలివేంద్రాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేసవి కాలంలో మండుటెండల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అలాంటి సమయంలో సేవా భావంతో చలివేంద్రాలను ఏర్పాటు చేయడం గొప్ప విషయమని తెలిపారు. ప్రయాణికులు, వాహనదారులు, గ్రామ ప్రజలు ఈ చలివేంద్రం ద్వారా చల్లని తాగునీరు పొందుతూ ఉపశమనం పొందాలని ఆకాంక్షించారు.శ్రీ కమలి బాబా ఆశ్రమం నిర్వహకులు మాట్లాడుతూ వేసవి కాలమంతా ఈ చలివేంద్రం ద్వారా ప్రజలకు నిరంతరం తాగునీరు అందించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆశ్రమ నిర్వాహకులతో పాటు వీఆర్వోలు నెక్కడపు మధుబాబు, నాగుల్ మీరా మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. గ్రామంలో ఏర్పాటు చేసిన ఈ చలివేంద్రం ప్రజలకు ఉపయోగపడుతుందని స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు.

అంగరంగ వైభవంగా శ్రీరామనవమి ఉత్సవాలు.

ఆ టెండర్ను రద్దు చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *