మార్చి 28, నేటి తెలుగు పత్రిక: ఇంధనంపై ఎక్సైజ్ సుంకం తగ్గించిన కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని పవన్ కళ్యాణ్ స్వాగతించారు. ఈ సందర్భంగా ఆయన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకు కృతజ్ఞతలు తెలిపారు.పెట్రోల్పై రూ.10 ఎక్సైజ్ సుంకం తగ్గించడం, డీజిల్పై ఉన్న సుంకాన్ని పూర్తిగా రద్దు చేయడం వల్ల దేశ ప్రజలకు గణనీయమైన ఊరట లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. పశ్చిమాసియా పరిస్థితుల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం నెలకొన్నప్పటికీ, దేశ ప్రజలపై భారం పడకుండా కేంద్రం సమయోచితంగా నిర్ణయం తీసుకుందని అన్నారు.నరేంద్ర మోదీ అనుక్షణం ప్రజల క్షేమం కోసం కృషి చేసే నాయకుడని, క్లిష్ట పరిస్థితుల్లో కూడా ప్రజలకు అండగా నిలుస్తున్నారని పవన్ కళ్యాణ్ అభినందించారు.ఇంధన కొరత రాకుండా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తూ, ప్రజలపై భారం తగ్గించే చర్యలు తీసుకోవడం అభినందనీయం అని ఆయన పేర్కొన్నారు. ఈ నిర్ణయం ప్రజలతో పాటు చమురు సంస్థలకు కూడా ఉపయోగకరంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు.
