మార్చి 28, నేటి తెలుగు పత్రిక: విశాఖపట్నం నుంచి న్యూఢిల్లీకు బయలుదేరిన ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. విమాన ప్రయాణం మధ్యలో ఇంజిన్ వైఫల్యం సంభవించడంతో, పైలట్లు అప్రమత్తంగా వ్యవహరించి ఢిల్లీ ఎయిర్పోర్టులో అత్యవసర ల్యాండింగ్ చేశారు.ఈ విమానంలో సుమారు 160 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. అందరూ సురక్షితంగా బయటపడినట్లు అధికారులు వెల్లడించారు.ఈ ఘటనతో కొంతసేపు ప్రయాణికుల్లో ఆందోళన నెలకొన్నప్పటికీ, సమయానికి తీసుకున్న చర్యల వల్ల ప్రమాదం తప్పింది.ప్రస్తుతం ఈ ఘటనపై సంబంధిత అధికారులు విచారణ చేపట్టగా, ఇంజిన్ లోపం కారణాలపై సాంకేతిక బృందం పరిశీలిస్తోంది.
