మార్చి 28, నేటి తెలుగు పత్రిక: అమరావతి చట్టబద్ధత అంశంపై ఆంధ్రప్రదేశ్లో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి పేర్ని నాని ప్రభుత్వం నిర్వహించిన ప్రత్యేక అసెంబ్లీ సమావేశంపై విమర్శలు చేశారు.అసెంబ్లీని హడావిడిగా ఏర్పాటు చేసి, ప్రజా సమస్యలపై సమగ్ర చర్చ జరగలేదని ఆయన అన్నారు. సమావేశంలో ప్రధానంగా రాజకీయ విమర్శలకే ప్రాధాన్యత ఇచ్చారని ఆరోపించారు. ముఖ్యంగా, మాజీ సీఎం వై. ఎస్. జగన్ మోహన్ రెడ్డి పై విమర్శలే ఎక్కువగా వినిపించాయని పేర్కొన్నారు. అభివృద్ధి, ప్రజా ప్రయోజన అంశాలు పక్కనపడ్డాయని అభిప్రాయపడ్డారు.అలాగే, కౌన్సిల్లో చర్చ జరగకపోతే ఆ తీర్మానం ఎలా చెల్లుబాటు అవుతుందో ప్రభుత్వం స్పష్టం చేయాలని ప్రశ్నించారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల్లో పారదర్శకత అవసరమని ఆయన సూచించారు.
