Breaking News

నిజామాబాద్ బడ్జెట్ సమావేశంలో మహేష్ కుమార్ గౌడ్ కీలక సూచనలు

మార్చి 28, నేటి తెలుగు పత్రిక: నిజామాబాద్ నగర పాలక సంస్థ 2026-27 ఆర్థిక సంవత్సర బడ్జెట్ సమావేశం సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొని కీలక సూచనలు చేశారు.ఈ సందర్భంగా నగర అభివృద్ధి, మౌలిక సదుపాయాల విస్తరణ, ప్రజా సంక్షేమ కార్యక్రమాల అమలుపై ఆయన ప్రత్యేకంగా దృష్టి సారించారు. నగరంలో రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, స్ట్రీట్‌లైట్లు వంటి ప్రాథమిక సదుపాయాలను మరింత మెరుగుపరచాలని అధికారులకు ఆదేశించారు.ప్రజలకు అందుబాటులో ఉండే సేవలను వేగవంతం చేయాలని, ప్రతి వార్డుకు సమాన ప్రాధాన్యత కల్పించాలని సూచించారు.ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తూ నిజామాబాద్‌ను మరింత అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉందని, బడ్జెట్‌లో ప్రజల అవసరాలు ప్రతిబింబించాల్సిన అవసరం ఉందని అన్నారు.నగర అభివృద్ధికి కేటాయించిన నిధులను పారదర్శకంగా వినియోగించి, పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులకు ఆయన పిలుపునిచ్చారు.

తెలంగాణలో కొత్త పార్టీకి శ్రీకారం… కవిత సంచలన ప్రకటన

తెలంగాణ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్… DEET యాప్‌తో ఉద్యోగ సమాచారం మీ చేతిలోనే

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *